హైదరాబాద్ : టాలీవుడ్, బాలీవుడ్లకు చెందిన పలువురు తారలకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హీరాగోల్డ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు, ఇందులో భాగంగా ఆ సంస్థకు ప్రచారం చేసిన తారలకు నోటీసులిచ్చారు. నౌహీరా, క్యూనెట్ సంస్థలకు పలువురు తారలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. క్యూనెట్ కేసులో అల్లు శిరీష్, పూజా హెగ్డే, షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, వివేక్ ఒబెరాయ్, బొమన్ ఇరానీ, జాకీష్రాఫ్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో షారుఖ్ ఖాన్ మాత్రమే సమాధానమిచ్చారు. మిగిలిన వారికి మరోసారి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నౌహీరా కేసులో పోలీసులు 12 మంది సెలబ్రిటీలను గుర్తించారు. వారు కాంట్రాక్టు కుదుర్చుకున్నారా లేక రెమ్యునరేషన్ తీసుకున్నారా…అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. తదనంతరమే నోటీసులు పంపనున్నారు.