ఈశాన్య భారతానికీ పాకిన కరోనా

ఈశాన్య భారతానికీ  పాకిన కరోనా

ఇంఫాల్ :  కరోనా మహమ్మారి ఈశాన్య భారతానికీ పాకింది. ఉత్తర ఇంపాల్కు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి దీని బారిన పడినట్లు మంగళ వారం నిర్ధారించారు. ఇటీవల యూకే వెళ్లొచ్చిన ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నామని , ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడినట్ల్లైంది. మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos