ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బావ,వైఎస్ షర్మిళ భర్త బ్రదర్ అనిల్కుమార్కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అనిల్కుమార్పై జామీను రహిత అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడానికి వీలు లేకుండా చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా న్యాయస్థానం ఈ మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి స్పదించికపోవడంతో తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం అనిల్కుమార్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.2009 మార్చి 28వ తేదీన బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఒక పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారని అప్పట్లో అనిల్పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత కరుణగిరిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కరపత్రాలు పంచారని రాజకీయ ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై కేసు పెట్టారు పోలీసులు.ఆ కేసుకు సంబంధించి ఏ1గా ఉన్న అనిల్ కుమార్ ఎన్నిసార్లు సమన్లు జారీ చేసిప్పటికీ..న్యాయస్థానానికి హాజరు కాకపోవడం వల్ల ఈ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేశారు.దీనితో ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఖమ్మం సెకెండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం జయమ్మ ఈ నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు..