ఇస్లామాబాద్ : తాను నోబెల్ శాంతి బహుమతిని పొందేందుకు అర్హుడిని కాదనిపాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పేర్కొన్నారు. కశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం వివాదాన్ని పరిష్కరించి ఉప ఖండంలో శాంతి నెలకొల్పినపుడే మానవాభివృద్ధికి దారి తీస్తుందని సోమవారం ట్వీట్ చేశారు. తాను జెనీవా శాంతి ఒప్పందానికి అనుగుణంగా వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను విడుదల చేసినట్లు ప్రకటించారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేసినందుకు ఇమ్రాన్ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ దేశ పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించటం తెలిసిందే. ఇస్లామాబాద్-న్యూఢిల్లీల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ఇమ్రాన్ ఖాన్ సున్నితమైన పాత్ర పోషించారని పాక్ దేశ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి పార్లమెంటులో పేర్కొన్నారు