కృష్ణగిరి జిల్లాలో కరోనా బాధితులు లేరు

కృష్ణగిరి జిల్లాలో కరోనా బాధితులు లేరు

హొసూరు : కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇప్పటివరకు ఎవరు లేరని కలెక్టర్ ప్రభాకరన్ తెలిపారు. హొసూరు పారిశ్రామిక వాడలోని ఈ ఎస్ ఐ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డులో గల వసతులను ప్రభాకరన్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కృష్ణగిరి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితులు లేరని తెలిపారు. జిల్లాలోని హోసూరు, కృష్ణగిరి ప్రాంతాలలో 410 మంది అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా వాటిలో 265 మంది నమూనాలు నెగటివ్ అని తేలాయని, మిగిలిన 145 మంది రక్త నమూనాల పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. హోసూరు, కృష్ణగిరిలో కరోనా వైరస్ పరీక్ష చేసుకొనే ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రజలు సామాజిక దూరాన్ని, జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos