‘కేసీఆర్ ఎనిమిదో నిజాం’

‘కేసీఆర్ ఎనిమిదో నిజాం’

హైదరాబాదు:‘నిజాం తన పేరు చిరస్థాయిగా ఉండాలని చార్మినార్ నిర్మించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా పేరు కోసం కొత్త సచివాలయం నిర్మిస్తున్నార’ని భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్ మంగళవారం ఇక్కడ విమర్శించారు. ‘కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారు. తెలంగాణ కొత్త సచివాలయం ఒక మసీదులా ఉంది. హజ్ హౌస్ లా కనిపిస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్లాన్ ఎంఐఎం నేతలు ఇచ్చారా’ని ఎద్దేవా చేశారు.‘కరోనాతో ప్రజలు చనిపోతున్నారు. జనం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి కొత్త సచివాలయం ముఖ్యమైంది. . ప్రజల ప్రాణాలకు విలువ లేదా? కొత్త సచివాలయం కోసం పాత నిర్మాణాలు కూల్చివేయడం సరికాదు. పాత సచివాలయ భవనాలు మరో 50 ఏళ్ల వరకు పనిచేస్తాయని నిపుణులు కూడా చెప్పార’ని తెలిపారు.

తాజా సమాచారం