పాట్నా: ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై పార్టీలోని 90 శాతం మంది నేతలు అసంతృప్తిగానే ఉన్నార’ని మాజీ మంత్రి శ్యామ్ రజక్ సోమవారం ఇక్కడ బాంబు పేల్చారు. ‘‘నన్ను ఎవ్వరూ బహిష్కరించ లేదు. నేను నా రాజీనామాను స్పీకర్కు సమర్పించా. సామాజిక న్యాయం భంగమైన చోట నేనుండలేన’ని శ్యామ్ రజక్ తెలిపారు.‘ అసంతృప్తి పరుల్లో ఎవ్వరూ ఓ నిర్ణయాన్ని తీసుకునే స్థాయిలో ప్రస్తుతానికి లేరు. ఇతరుల గురించి నాకు తెలియదు. నేనైతే ఆర్జేడీలో చేరిపోతున్నాన’ని ప్రకటించారు. శ్యామ్ రజక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మంత్రి పదవి నుంచి నితీశ్ తొలగించారు.