పట్నా: భారతీయ జనతా పార్టీ తో ఎలాంటి విభేదాలు లేవని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టీకరించారు. ‘భాజపా, జేడీయూ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. గతంలో మాదిరే రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగు తున్నాయి. భాజపాతో మా అనుబంధం ఇంతకు ముందు లాగే పటిష్టంగా ఉంది. బిహార్లోని ఎన్డీయే కూటమిలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేవు’అని నితీశ్ వివరించారు. 2020లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే మిత్ర పక్షం గానే జేడీయూ మిలో భాగంగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఝార్ఖండ్, హరియాణా, దిల్లీ, జమ్మూ-కశ్మీర్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయనున్నారు.