పాట్నా: ప్రాణం పోయేంత వరకు బీజేపీతో మళ్లీ కలవనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, వారిని వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని విమర్శించారు. ‘గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసు పెట్టారు. దాంతో లాలూతో తనకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు తాము మళ్లీ కలిశాం. దీంతో మళ్లీ కేసులు పెడుతున్నారు. ప్రస్తుత బీజేపీ నాయకత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వాజ్ పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి హయాం నాటి బీజేపీ ఇప్పుడు లేదు. అందుకే నేను బీజేపీతో మళ్లీ కలవబోనని చెపుతున్నా. బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్ బంధన్ ఎప్పటికీ కలిసే ఉంటుంద’ని చెప్పారు.