పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడి రాజ్భవన్కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయేకు గుడ్బై చెప్పాలని నితీశ్ నిర్ణయించారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్తో సంప్రదింపులు జరిపారు. వారితో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసే యోచనలో నితీశ్ ఉన్నారని సమాచారం.