‘మౌనం’ దాల్చిన నిర్భయ దోషులు..

‘మౌనం’ దాల్చిన నిర్భయ దోషులు..

వచ్చేనెల 1వ తేదీన నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఖాయం కావడంతో జైలు అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉరిశిక్ష అమలులో భాగంగా ఆనవాయితీ ప్రకారం నిందితుల చివరి కోరిక తీర్చడానికి నిర్ణయించుకున్న జైలు అధికారులు చివరి కోరికలు ఏమైనా ఉం టే చెప్పాలంటూ అడగగా నలుగురు నిందితులు మౌనం వహించారని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. శిక్ష అమలు చేసే ముందు దోషుల ఆఖరి కోరిక తీర్చడం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. కుటుంబ సభ్యులను కలవాలనో, తమ ఆస్తులు ఎవరికైనా రాసివ్వాలనో, మంచి భోజనంఇలా చట్టపరమైన పరిధిలో ఉన్న కోరికైతే తీర్చేందుకు జైలు అధికారులు ప్రయత్నిస్తారు.కానీ అసలు దోషులు నోరే విప్పడం లేదని, ఏం అడిగినా మౌనమే సమాధానం అని తీహార్ జైలు అధికారులు తెలియజేస్తున్నారు. నేరం రుజువై శిక్ష ఖాయమైనా ఎప్పటి నుంచో అమలు కాకపోవడం, ఎట్టకేలకు కోర్టు డెత్ వారెంటు జారీ చేసినా అది కూడా వాయిదా పడడంతో రెండోసారి డెత్ వారెంట్లు జారీ చేసినా తమ శిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమా దోషుల్లో కనిపిస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos