తొమ్మిదో రోజు… పెరిగిన ‘పెట్రో’ ధర

ముంబై: దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ సోమవారం పెరిగాయి. పెట్రోలు ధర 48-62 పైసలు, డీజిల్ ధర 53-64 పైసల వరకూ పెరిగింది. దీని ప్రకారం లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 75.78, చెన్నైలో రూ. 79.53, ముంబయిలో రూ. 82.70కి పెరుగగా, ఇవే నగరాల్లో డీజిల్ ధరలు వరుసగా రూ. 74.03, రూ. 72.18, రూ. 72.64కు చేరాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 78.67కు, విశాఖపట్నంలో రూ. 77.47కు చేరుకోగా, లీటరు డీజిల్ ధర విశాఖపట్నంలో రూ. 71.25కు చేరుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos