అమరావతి : వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగాఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మ గడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిందన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ పరమైన అవసరమని వివరించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ ఎన్నికలు అవసరమన్నారు. ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.