ముంబై: ‘క్రికెట్లో, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జర గొచ్చని’ మహారాష్ట్ర రాజకీయాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్ర వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘క్రికెట్లో అనేక పార్లు మ్యాచ్ ఓడిపోతామని అంచనా వేస్తాం. తుది ఫలితం మరోలా ఉం టుం ది. నేను ఈ మధ్య ఢిల్లీ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నందున మహారాష్ట్ర విషయాలపై పెద్దగా సమాచారం లేదు. రాష్ట్రం లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతాయి. భాజపా సారథ్యంలో కాకుండా ఇత రుల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా అభివృద్ధి పథకాల అమలుకు కేంద్రం సహకరిస్తుంద’ని భరోసా ఇచ్చారు. మహా రాష్ట్ర లో ఇటీవల రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.