కొత్తగా 328 పాజిటివ్ కేసులు

కొత్తగా 328 పాజిటివ్ కేసులు

ఢిల్లీ : నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాతే తర్వాత 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో 50 మంది మృతి చెందగా 151 మంది కోలుకున్నారన్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 12 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఢిల్లీ మర్కజ్ వచ్చిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, జమ్ముకశ్మీర్ వాసులు ఉన్నారన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ సమావేశం తర్వాత 9 వేల మందిని క్వారంటైన్‌కు తరలించామని.. వారిలో 1,804 మంది జమాతేకు హాజరైనవారేనన్నారు. ఐసోలేషన్, కరోనా పరీక్షలపై దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారని లవ్ అగర్వాల్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos