అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 5,783 మంది శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1259కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కొవిడ్ ఆసుపత్రుల్లో 970 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా 40 కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి.