కొత్తగా 62 కరోనా కేసులు

కొత్తగా 62  కరోనా కేసులు

అమరావతి: గత 24 గంటల్లో 62 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఇక్కడ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1525కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 33 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా 25 కర్నూలు జిల్లావి. ఆసుపత్రుల్లో చికిత్స పొంది 441 మంది విడుదలయ్యారు. 1051 మంది చికిత్స పొందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos