బోధిధర్మను తీసుకురమ్మని మెసేజ్‌లు పెడుతున్నారట..

  • In Film
  • March 30, 2020
  • 112 Views
బోధిధర్మను తీసుకురమ్మని మెసేజ్‌లు పెడుతున్నారట..

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో సూర్య కాంబినేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సెవెన్స్‌ సెన్స్‌ చిత్రంలో పరిస్థితులో ప్రస్తుతం భారత్‌లో ప్రపంచంలో నెలకొన్నాయి.చైనా సృష్టించిన వైరస్‌ కారణంగా భారత్‌లో వేలాది మంది మృత్యువాత పడడాన్ని చిత్రంలో చూపించారు. ఇప్పుడు అచ్చుఅలాగే చైనాలు పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ కారణంగా భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ ముప్పును ఎదుర్కొంటున్నాయి. చైనా,ఇటలీ,స్పెయిన్‌,ఫ్రాన్స్‌,ఇరాన్‌,అమెరికా తదితర దేశాల్లో అయితే పరిస్థితి మరింత భయానకంగా ఉంది.ఈ నేపథ్యంలో సెవన్త్‌ సెన్స్‌ చిత్రంలో చూపించినట్లు నిజజీవితంలో కూడా జరగాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.చిత్రంలో  వైరస్ నాశనం కావాలంటే వందేళ్ల కిందటి బోధిధర్మని తీసుకురావడం ఒకటే మార్గమని జన్యు పరిశోధకురాలైన శ్రుతి తెలుసుకుంటుంది.అతని వంశానికి చెందిన హీరోలో జన్యు పరిణామ క్రమం జరిపి వందేళ్ల కిందటి బోధిధర్మని మళ్లీ తీసుకొస్తుంది. అతను ఇచ్చిన మందు వల్ల వైరస్ నాశనమైపోతుంది.దీంతో కరోనా వైరస్‌ను అంతం చేయడానికి బోధిధర్మని మళ్లీ తీసుకురమ్మంటూ నెటిజన్లందరూ శ్రుతికి మెసేజ్‌లు పెడుతున్నారట. సోషల్ మీడియా ద్వారా శ్రుతి విషయాన్ని వెల్లడించింది.  

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos