ఓలీని చంపుతా

ఓలీని చంపుతా

ఖాట్మండు : నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీని చంపుతానని నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేత నరోత్తమ్ బైద్య హెచ్చరించారు. ఓలీ ఇటీవల తన మంత్రివర్గాన్ని విస్తరించడాన్ని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని నరోత్తమ్ ఆరోపించారు. బాగ్మతి ప్రావిన్స్ లెజిస్లేచర్ సభ్యుడు నరోత్తమ్ బైద్య నేపాల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ, అధికారంలో కొనసాగడం కోసం పరిపాలనలో ప్రతి అంశాన్నీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆయనను ఇలా వదిలిపెడితే దేశం కుప్పకూలుతుందన్నారు. మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను గుర్తు చేస్తూ, ‘‘దేశాన్ని కాపాడండి’’ అని విజ్ఞప్తి చేశారు, ‘‘ఎవరూ సిద్ధంగా లేకపోతే’’ తానే ఆ పని చేస్తానన్నారు. నరోత్తమ్ ఈ వ్యాఖ్యలను బాగ్మతి ప్రావిన్స్ అసెంబ్లీలో చేశారు. దీంతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు సీపీఎన్-యూఎంఎల్ (కేపీ ఓలీ నేతృత్వంలోని గ్రూపు) కూడా విమర్శించింది. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయనను నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బిషోప్రకాశ్ శర్మ కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos