నెహ్రాపై ఆర్‌సీబీ అభిమానుల ఆగ్రహం

  • In Sports
  • April 16, 2019
  • 139 Views
నెహ్రాపై ఆర్‌సీబీ అభిమానుల ఆగ్రహం

ముంబై : ఆర్‌సీబీ సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్‌ కోచ్‌ అశిష్‌ నెహ్రా అని అభిమానులు మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్‌ చివరి 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. 19వ ఓవర్‌ను ఫాస్ట్‌ బౌలర్‌ నవదీఫ్‌కు ఇవ్వడానికి కెప్టెన్‌ కోహ్లీ సమాయత్తమయ్యాడు. అయితే స్పిన్నర్‌ పవన్‌ నెగికి ఇవ్వాలని నెహ్రా డగౌట్‌ నుంచి కోహ్లీకి సూచించాడు. దీంతో అతను పవన్‌కు బౌలింగ్‌ ఇవ్వడం, పాండ్యా చెలరేగి ఆ ఓవర్‌ ముగిసేలోగానే 22 పరుగులు చేయడం జరిగిపోయింది. దీనిపై అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పాండ్యా, పొలార్డ్‌ వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నప్పుడు స్పిన్నర్‌ చేత ఎవరైనా బౌల్‌ చేయిస్తారా అనేది అభిమానుల ప్రశ్న. ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసే నవదీప్‌ చేత ఆ ఓవర్‌ వేయించి ఉంటే బ్యాట్స్‌మెన్‌ కొంత ఇబ్బంది పడి ఉండేవారని వారు అభిప్రాయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos