లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రదాన నిందితుడైన నీరవ్ మోదీ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ లండన్ వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 19 వరకు ఆయనను కస్టడీలోనే ఉంచాలని న్యాయమూర్తి తన్ ఇక్రమ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. లండన్ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా నీరవ్ మోదీని కోర్టులో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 19న మళ్లీ వీడియో లింక్ ద్వారా కోర్టులో ప్రవేశ పెట్టాలని జడ్జి ఆదేశించారు. విచారణ సందర్భంగా ట్రాక్సూట్లో నీరవ్ మోదీ ఉత్సాహంగా కనిపించారు. ఈ ఏడాది మార్చి 19న స్కాట్లాండ్ యార్డ్ అధికారులకు పట్టుబడ్డాడు.