పంచాయతి ఎన్నికలు ఫిబ్రవరిలో సాధ్యం కాదు

పంచాయతి ఎన్నికలు ఫిబ్రవరిలో సాధ్యం కాదు

అమరావతి : కరోనా దృష్ట్యా పంచాయతి ఎన్నికల నిర్వహణ వచ్చే ఫిబ్రవరిలో సాధ్యం కాదని ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఎన్నికల కమిషనరు రమేశ్ కుమార్కు లేఖ రాసారు. ‘కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. ఏపీలో 6,890 మంది కరోనా వల్ల మృతి చెందారు. మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోము. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనా కట్టడికి పరిపాలన, పోలీసు సిబ్బంది, వివిధ శాఖలు కృషిచేస్తున్నాయి. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణపై సమాచారం అందిస్తాం. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సరికాదు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో అది అవసరం లేద’ని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos