హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఇక్కడి ఏషియన్ గాస్ట్రోలజి ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పరగడపునే సుమారు గంటకు పైగా ఆయనకు నిపుణులు పరీక్షలు జరిపారు. తర్వాత ఇంటికి వెళ్లి పోయారు. నివాసంలో ఆయనతో సీనియర్ నాయకులు జెసి దివాకర్ రెడ్డి, ఎల్.రమణ, రావుల, చంద్రశేఖర్ రెడ్డి సమావేశమై తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.