రాణా దంపతులకు దక్కని ఊరట

రాణా దంపతులకు దక్కని ఊరట

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వద్ద హనుమాన్ చాలీసాను పఠిస్తామని ప్రకటించి, అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలకు శుక్రవారం కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిలు దరఖాస్తులపై శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. రాణా దంపతులపై పై ఐపీసీ సెక్షన్ 153(ఏ), పోలీస్ యాక్ట్లోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నవనీత్ బైకులా జైలులోనూ, రవి తలోజా జైలులోనూ ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos