ముజఫర్నగర్ : ఇకనుంచి ఎలాంటి శుభ కార్యక్రమాలకూ భాజపా నేతలను ఆహ్వానించకూడదని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు చౌదరి నరేష్ పిలుపు నిచ్చారు. శనివారం ఇక్కడ జరిగిన కిసాన్ మహా పంచాయత్ లో ప్రసంగించారు. ‘భాజపా నేతలను ఎవరైనా శుభకార్యాలకు ఆహ్వానించినట్లు తెలిస్తే…. వారు ఆ తర్వాత రోజు వంద మందికి ఆహారం పెట్టాల్సి ఉంటుంది. ఇదే వారికి విధించే శిక్ష’అని హెచ్చరించారు.