తన పరువుకు భంగం కలిగించేలా వార్త ప్రచురించిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ సాక్షి తెలుగు దినపత్రికపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు.గత ఏడాది అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి‘ అనే శీర్షకతో సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్ సాక్షిపై విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు.తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో వ్యాజ్యం దాఖలైంది.