ఎవరు అవునన్నా కాదన్నా అధికార తెలుగు దేశం పార్టీకి,సూపర్స్టార్ కృష్ణ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది.తెలుగుదేశానికి కృష్ణ కుటుంబ సభ్యులు అండదండలు,మద్దతు ఉన్నాయని చెప్పడం లేదుకానీ కృష్ణ కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు మాత్రం తెదేపాలో ఉన్నారు.ఇప్పటికే కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ తెదేపాలో ఎంపీగా కొనసాగుతుండగా కొద్ది రోజుల క్రితం కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా తెదేపాలో చేరారు.ఇక లోక్సభకు కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బావ గల్లా జయదేవ్కు మద్దతుగా ప్రిన్స్ మహేశ్బాబు ఎన్నికల ప్రచారాల్లో పాల్గోనున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..మహేశ్కు రాజకీయాల్లోకి వచ్చే సమయం కానీ ఉద్దేశం కానీ లేదంటూ స్పష్టం చేసారు.రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తెలుగు నటుల్లో మహేశ్బాబు కూడా ఒకరని తనకు సినిమాలు,కుటుంబం తప్ప మరో ప్రపంచం,విషయం తెలియదన్నారు.తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పయనించాలని మహేశ్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారని రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడాన్ని మహేశ్ ఎంతో గర్వంగా భావిస్తారన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినంత మాత్రాన మహేశ్ రాజకీయవేత్త అయిపోరు. పాలిటిక్స్ గురించి ఆయన నాతోనే సరిగ్గా మాట్లాడరు. ఇక వేదికలెక్కి ప్రసంగాలు ఎలా ఇస్తారు?’ అని వెల్లడించారు నమ్రత.ప్రస్తుతం మహేశ్ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. రెండో షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.