నళినికి పెరోల్ పొడిగింపు

  • In Crime
  • August 22, 2019
  • 127 Views
నళినికి పెరోల్ పొడిగింపు

చెన్నై : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ పెరోల్‌ను గురువారం చెన్నై హైకోర్టు మరో మూడు వారాలకు పొడిగించింది. కుమార్తె వివాహం నిమిత్తం పెరోల్ మీద జులై 25న జైలు నుంచి ఆమె విడుదలైంది. ఆగస్టు 25తో గడువు ముగియనుంది. తాజాగా ఆమె అభ్యర్థనను పరిశీలించిన కోర్టు మరో మూడు వారాలకు పెరోల్‌ను పొడిగించింది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాలేదని, మరో నెల రోజులు పెరోల్‌ను పొడిగించాలని ఆమె అభ్యర్థించింది. తన భర్త సోదరుడితో కలిసి లండన్‌లో ఉంటున్న తన కుమార్తె సెప్టెంబరు మొదటి వారంలో భారత్‌కు వస్తుందని, ఆమె వచ్చిన తరువాత వివాహ ఏర్పాట్ల కోసం సమయం కావాలని  పేర్కొంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమె గత 27 ఏళ్లుగా వేలూరులోని మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తోంది. ఆమె భర్త మురుగన్ వేలూరు పురుషుల జైల్లో ఉన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos