అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం

అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం

రాష్ట్ర అభివృద్ధికి తమతో కలిసి వస్తే ప్రజలు నమ్ముతారు కాని అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శనివారం ఉదయం గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నక్కా ఆనందబాబు ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనందబాబు వైసిపి అధ్యక్షులు జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. వృద్ధులకు, వితంతువులకు పెద్ద కొడుకులా ఉంటానని హామీ ఇచ్చి పెన్షన్లు రెట్టింపు చేయడం చంద్రబాబు కే సాధ్యమైందన్నారు. గులకరాళ్ళు లాంటి నవరత్నాలను చూసి పెన్షన్‌ పెంచామని వైసిపి మీడియాలో ప్రచారం కోసం మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పెన్షన్‌ ను రెంట్టింపు చేశామన్న విషయాన్ని వైసిపి గుర్తించాలన్నారు. రాష్ట్రంలో ఉండే అర్హత జగన్‌ కు లేదని, జగన్‌ అవసరం ప్రజలకు లేదని మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయకుండా రోడ్ల పై జగన్‌ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అవినీతి పై జగన్‌ ఆవిష్కరించిన పుస్తకాలను ప్రజలు భోగి మంటల్లో వేస్తారని వ్యంగ్యాస్త్రం సంధించారు. కేసుల నుండి బయట పడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులత్తుతూ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో సింగిల్‌ డిజిట్‌ కు వైసిపి పార్టీ పరిమితమవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమతో కలిసి వస్తే ప్రజలు నమ్ముతారు కాని అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos