లక్నో:‘అమేథీ లోక్సభ నియోజకవర్గంలోని గ్రామ పెద్దలకు భాజపా నేతలు లంచాలు పంపిస్తున్నారు’ అని ప్రియాంక గాంధీ శనివారం అమేథిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. గ్రామ పెద్దలకు రూ.20,000 వంతున నగదు కానుకల్ని సమర్పించి వారి ప్రేమా భిమానాలను పొందేందుకు కమల నాధులు నేతలు ప్రయత్ని స్తున్నారని దుయ్యట్టారు. అమేథీ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, అమేథీ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ అమేథీలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల పనులను భాజపా ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.