అన్నదాతల్ని అడ్డుకునేందుకు బాటలపై మేకులు కొట్టిన ఖాకీలు

అన్నదాతల్ని అడ్డుకునేందుకు బాటలపై మేకులు కొట్టిన ఖాకీలు

న్యూ ఢిల్లీ: నగరంలోకి రైతులు ప్రవేశించకుండా పోలీసులు రోడ్లపై మేకులు కొట్టటం సామాజిక మాధ్యమాల్లో సంచలనమయ్యాయి. సింఘూ సరిహద్దులో రెండు వరుసల ఇనుప చువ్వల్ని నేలలోకి పాతారు. మూడు అడుగుల వెడల్పు ఉన్న గోడను కట్టారు. ఈ చిత్రాల్ని సామాజియమాధ్యమాల్లో పోస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ రోడ్లపై గోడలకు బదులు వంతెనలు నిర్మించాలని ఎద్దేవా చేసారు. ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తామని రైతులు ఇప్పటికే హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos