కుల చిచ్చు వద్దు- నాగబాబుకు హితవు

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగబాబు. ఓటమి భయంతో ఇష్టానుసారంగా మాట్లాడు తున్నారని వైకాపా అభ్యర్థి రఘు రామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ఊర్లో గ్రంథాలయ స్థాపనకు ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకున్న నాగ బాబు వ్యక్తిత్వం గురించి జిల్లాలో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల కోసమే మళ్లీ సొంత ఊరికి వచ్చారని ఎద్దేవా చేసారు. నాగ బాబు తీరుతో చిరంజీవి, పవన్ కల్యాణ్ గౌరవం కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. వాపును చూసి బలుపు అనుకోవద్దని హితవు పలికారు. ఏప్రిల్ 11న ఎవరేంటో తెలిసిపోతుందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos