మొద్దు నిద్రలో కేసీఆర్

మొద్దు నిద్రలో కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకు పోయిందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. పలు జిల్లాల్లో భాజపా కార్యాలయాలకు సోమవారం భూమి పూజ జరిగింది. వర్చువల్ వేదికగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడారు. ‘రూ.45 వేల కోట్లకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే రూ.85 వేల కోట్లకు పెంచారు. గత ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటోముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50 వేల ఇళ్ళు కూడా కట్టలేదు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది. లోక్ సభ ఎన్నికల మాదిరిగానే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన. దీని ప్రకారమే పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos