చిట్టగాంగ్ : ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ టెస్టు క్రికెట్కు విశ్రాంతి పలకనున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు అనంతరం నబీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ఆఫ్ఘన్ జట్టు మేనేజర్ నజీమ్ జార్ తెలిపారు. టీ20 ఫార్మాట్లో చక్కని ఆట తీరును ప్రదర్శించడం ద్వారా నబీ క్రికెట్ అభిమానుల గుర్తింపును పొందగలిగాడు. పలు సందర్భాల్లో ఆప్ఘన్ జట్టుకు కీలక ఆటగాడుగా మారిన నబీ మూడు టెస్టులు, 121 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో హైదరాబాద్ సన్రైజర్స్ తరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది.