హోసూరు ఇటుకల బట్టీలో అనుమానాస్పద మృతి

హోసూరు ఇటుకల బట్టీలో అనుమానాస్పద మృతి

హోసూరు : ఇక్కడికి సమీపంలోని ఓ ఇటుకల బట్టీలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సేలం సమీపంలోని కొండలాంపట్టి వద్ద గల వి.మేటూర్ గ్రామానికి చెందిన తంబన్‌తో పాటు అదే గ్రామానికి చెందిన కొంత మంది హోసూరు సమీపంలోని ఓ ఇటుకల బట్టీలో పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇటుకల బట్టీ ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భవనం పైభాగానికి తంబన్‌ తన బావ వేలుతో కలసి వెళ్ళాడు. భవనం పైభాగానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎంతసేపైనా తిరిగి రాలేదు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న భవనం రెండవ అంతస్తులో తంబన్ శవమై కనిపించాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనపరచుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన తంబన్ తల వెనుక భాగంలో గాయం ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. తంబన్‌తోపాటు భవనంపైకి వెళ్లిన అతని బావ వేలు అదృశ్యం కావడంతో పోలీసుల అనుమానం మరింత భలపడింది. తంబన్ శవాన్ని పోలీసులు హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos