‘నా హత్య’కు అమిత్ షా కుట్ర

‘నా హత్య’కు అమిత్ షా కుట్ర

శ్రీనగర్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను చంపించేందుకు కుట్రలు పన్నుతున్నారని జమ్ము- కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి , లోక్సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘నన్ను అక్రమంగా నిర్బంధించారు. , నా కుమారుడు ఒమర్ అబ్దుల్లాను జైల్లో పెట్టారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. జమ్ము-కశ్మీర్కు చెందిన ముఖ్య నేతలందరినీ రహస్య ప్రాంతాల్లో నిర్బంధించారు. ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమ’ని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో తన గురించి అమిత్ షా అబద్ధాలు చెప్పారని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రం తగులబడుతుంటే నేను ఇంట్లో ఎలా కూర్చుంటాను. అమిత్ షా కావాలనే నేను ఇంట్లో కూర్చున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అల్లకల్లోలంగా మారిన పుడు ఇంట్లో ఎలా కూర్చుంటాన’ని ప్రశ్నించారు. ‘కేంద్ర నాయకులు ప్రాంతాలను విభజించారు. హృదయాలను కూడా విభజిస్తారా. జనాలను కూడా హిందూ, ముస్లింలుగా విభజి స్తారా.ఈ దేశం లౌకికతను, ఐక్యతను విశ్వసిస్తుందని భావిం చాను. ఇప్పుడు భాజపా అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించింద’ని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos