హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నోటిఫికేషన్లో నిబంధనలు పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయరాదని ఆదేశించింది. వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొన్ని అంశాలను లేవనెత్తారు. తొలుత రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించాలని, కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిబంధనలేమీ పాటించలేదని న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తమ్కుమార్రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సదరు నోటిఫికేషన్ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, సవరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు.