‘చైనాను వెళ్లగొట్టలేరు కానీ.. కశ్మీర్​ను కొల్లగొడతారా?’

శ్రీనగర్: ‘భారత భూభాగం నుంచి చైనాను వెళ్లగొట్టలేరు కానీ, కార్పొరేట్ల కోసం కశ్మీరీల భూమిని లాక్కొవాలనుకుంటున్నార’ని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ గురువారం ఇక్కడ విమర్శించారు. కశ్మీర్ను కొల్లగొట్టాలనేదే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆరోపిం చారు. ‘వారు (కేంద్రం) ఇక్కడ మాట్లాడటానికి ఎవరినీ అనుమతించరు. వారి ఉద్దేశాలన్నీ మత తత్వంతో కూడుకున్నవే. పేదలకు కనీసం ఆహారం అందించటంలో భరోసా ఇవ్వలేక పోయారు. వారు ఉద్యోగాలు, ఆహారం గురించి అడిగిన ప్రతిసారి ఆర్టికల్ 370ని రద్దు చేశాం, జమ్ముకశ్మీర్లో భూమి కొనుగోలు చేయొచ్చు అని చెబుతున్నారు. జమ్ముకశ్మీర్ను అతిపెద్ద జైలుగా మార్చారు. మీరు బలవంతులైతే ముందుగా భారత భూభాగం నుంచి చైనాను వెనక్కి పంపండి. కనీసం వారు చైనా పేరు కూడా ఎత్తటం లేదు. వారి బలాన్ని కేవలం జమ్ము-కశ్మీర్పై చూపుతున్నార’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos