హైదరాబాద్: మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో తెరాస నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. జిల్లాలోని ఆరు నియోజక వర్గా లను తెలంగాణలో కలపాలనే ఆందోళన అక్కడ సాగుతోంది. ఎన్నికల బరిలోకి దిగాలని నాందేడ్లోని వివిధ రాజకీయ పక్షాల నేతలు ముఖ్యమంత్రి కేసీ ఆర్కు చేసిన వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు.