పాక్‌కు మోకరిల్లిన భారత్‌

పాక్‌కు మోకరిల్లిన భారత్‌

న్యూఢిల్లీ: పాక్ ఉగ్రవాదుల పీచ మణ చటానికి బదులుగా కేంద్రం పాక్ కు మోకరిల్లుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మనీశ్ తివారి ట్విట్టర్లో కేంద్రంపై విరుచుకు పడ్డారు. ఉగ్రవాదుల ముప్పు నుంచి యాత్రికుల్ని తప్పించేందుకంటూ అమర్నాథ్, మచైల్ మాత యాత్రల్ని రద్దు చేయటాన్ని ఖండించారు. యాత్రికులకు తగిన రక్షణ ఇవ్వకుండా వారిని వెనక్కు తిప్పి పంపేయటం సిగ్గు చేటన్నారు. ‘1947 అక్టోబర్ నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని జమ్ము- కశ్మీర్ ఎదుర్కొంటోంది. 1990 దారుణ పరిస్థితుల్లో అప్పటి ప్రధాని వీపీ సింగ్కు భాజపా, కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. 1947 అక్టోబర్, 1990లో పాకిస్తాన్ ముందు భారత దేశం ఇప్పుడు మోకరిల్లినట్టుగా ఎప్పుడూ మోకరిల్లలేదు. యాత్రను రద్దు చేయటానికి బదులు ప్రభుత్వం వారికి తగిన భద్రత కల్పించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos