విశాఖ పట్టణం: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంకృత అపరాధాలే ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణాలవుతాయని భాజపా కార్యదర్శి మురళీధర రావు వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేకత జగన్కు కలిసొచ్చే అంశంగా కనబడుతోదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశ వ్యాప్తంగా మోదీకి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా 280కి పైగా స్థానాల్లో భాజపా గెలవనుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నారు. మే 23 తర్వాత భవిష్యత్తు ప్రణాళిక గురించి వెల్లడిస్తామని తెలిపారు.