భోపాల్: మధ్య ప్రదేశ్ శాసనసభలో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొరెనా నియోజకవర్గంలో బీఎస్పీది పై చేయి. బీజేపీ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ నేతలు, కార్యకర్తలు వేడుకలు చేసారు. ముగ్గురు మంత్రులు తమ ప్రత్యర్థులకన్నా వెనుకబడి ఉండడం గమనార్హం. సుమావోలి నియోజక వర్గంలో ఐదాల్ సింగ్ కన్సానా, దిమాని నియోజవకర్గంలో గిరిరాజ్ దండోత్, మెహగావ్ నియోజకవర్గంలో ఓపీఎస్ భదోరియా వెనుకంజలో ఉన్నారు.