ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం

ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం

న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాని మోదీ కోరారు. సూరజ్కుండ్లో సమావేశమైన రాష్ట్రా ల హోం మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. ఇటువంటి నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని చెప్పారు. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్య మంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos