గుజరాత్లో మోదీ జపం ఇంకా సాగుతూనే ఉంది. సూరత్ మార్కెట్లో తాజాగా వచ్చిన మోదీ చీరలు మహిళలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మోదీ చిత్రాలతో ఉన్న ఈ చీరలను కొనుగోలు చేయడానికి మహిళలు తెగబడుతున్నారట. నాలుగు రకాల్లోని ఈ చీరలు అనేక రంగుల్లో ఉన్నాయి. డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో మోదీ ఫొటోలను చీరలపై ముద్రిస్తున్నారు. మున్ముందు ప్రముఖ రాజకీయ నేతల చిత్రాలను ముద్రించిన చీరలను కూడా మార్కెట్లో ప్రవేశపెడతామని వ్యాపారులు ప్రకటించారు.