కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ;ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం బెంగాల్లోని బంకూరలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.ఆమె దుర్బాషలే తనకు దీవెనలని అభివర్ణించారు. తనను దేశ ప్రధానిగా అంగీకరించనని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఆమె పాకిస్తాన్ ప్రధానిని మాత్రం గుర్తిస్తారని చురకలు వేశారు.