ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం: పోచారం

ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం: పోచారం

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌, సభ్యులకు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభలో తొలిసారిగా ఆయన ప్రసంగించారు. శాసనసభాపతి పదవి అత్యంత కీలకమని.. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభను నిర్వహించుకుందామని చెప్పారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో సభ్యులంతా సహకరిస్తారని భావిస్తున్నానన్నారు. సభ్యులందరం కలిసి ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదామని పోచారం పిలుపునిచ్చారు. సభ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు అంతా కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos