మోదీ నోట అబద్ధం

మోదీ నోట అబద్ధం

ముంబై : చైనా దళాలు భారత భూభాగం నుంచి వెనుదిరిగాయని ప్రధాని మోదీ అబద్ధం చెప్పారని శివసేన పత్రిక- సామ్నా మండిపడింది. తూర్పు లడఖ్ నుంచి నిష్క్రమించడానికి చైనా దళాలు అంగీకరించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజ్యసభ లో ప్రకటించారు. ‘చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడలేదని రెండు నెలలుగా ప్రధాని మోదీ చెబుతూనే ఉన్నారు. చైనా బలగాలు భారత సరిహద్దుల నుంచి వెనుదిరుగు తున్నాయని అదే ప్రధాని తాజాగా ప్రకటించారు. దీనర్థం చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయనేదే కదా . ఈ విషయంలో ప్రధాని మోదీ దేశానికి అబద్ధం చెప్పార’ని దుయ్యబట్టింది. భారత భూభాగం నుంచి చైనా దళాలు వెనక్కి మరలడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొంది. ఈ గొదప్పనమంతా అంతా దౌత్యం నెరపిన రక్షణ శాఖకు వెళ్తుంది. చైనా విషయంలో కేంద్రం చెప్పిన అబద్ధాలనే తాము ప్రశ్నిస్తున్నామని తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos