దీపాలు వెలిగించమంటే…పిస్తోల్ పేల్చారు

దీపాలు వెలిగించమంటే…పిస్తోల్ పేల్చారు

లఖ్నవ్: దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రజలు విద్యుత్ దీపాల్ని ఇళ్లల్లో ఆర్పేసిన వేళ పిస్తోల్‌తో పేల్చిన బలరాం పూర్ భాజపా నేత మంజు తివారిపై పోలీసులు కేసు దాఖలు చేసారు. సంబంధిత వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. దీంతో అనివార్యంగాఆమెపై ఐపీసీ సెక్షన్ 286 (ఆయుధాల చట్టం) కింద కొత్వాలి నగర్ పోలీసులు ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. ‘నగరం మొత్తం కొవ్వొత్తులు, దీపాల కాంతులతో మెరిసిపోవడంతో దీపావళి జరుపుకొంటున్న అనుభూతి కలిగింది. ఉత్సాహం పట్టలేకపోయాను. నా పొరపాటు ఒప్పుకుంటున్నాను. అందుకు క్షమాపణలు కూడా చెబుతున్నాను’ అని తివారీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos