పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : ఎమ్మెల్యేల వినతి

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : ఎమ్మెల్యేల వినతి

హోసూరు : కృష్ణగిరి జిల్లా కెలమంగలం సమీపంలోని పచ్చపనట్టి గ్రామంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కెలమంగలం యూనియన్ పచ్చపనట్టి గ్రామ పంచాయతీలో సుమారు 85 కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. వీరు ఇంటి పట్టాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తళి ఎమ్మెల్యే వై ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ షయంపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్, హోసూరు ఎమ్మెల్యే సత్య, వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ లతో కలిసి కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. హోసూరు, డెంకణీకోట, సూలగిరి తదితర ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ, అందుకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ కు విన్నవించారు. దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos