హొసూరు : కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలోని అటవీ ప్రాంత గ్రామాలలో ఎమ్మెల్యే వై. ప్రకాష్ పేద ప్రజలకు నిత్యావసరాల ను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పట్టణాలు, గ్రామాల్లో రాజకీయ నాయకులు, దాతలు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని కావేరి పరీవాహక ప్రాంత గ్రామాలైన బిలిగుండ్లు, అంచెట్టి తదితర గ్రామాలలో 5 వందల మంది పేద కుటుంబీకులకు తళి ఎమ్మెల్యే ప్రకాష్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నెల రోజులుగా ఆయన నియోజకవర్గంలో పలుచోట్ల పేద ప్రజలకు నిత్యావసరాలత్యా పంపిణీ చేస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగినంత వరకూ పేద ప్రజలను ఆదుకుంటామని ఎమ్మెల్యే వై ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు